ఆ సమావేశంలో చివరికి మిగిలింది నేనొక్కడినే!

గత ఏడాది డెట్రాయిటులో జరిగిన తెలుగు మహాసభలకి వెళ్ళాం. అందులో సాహితీ సమావేశం జరపాలా వద్దా అన్న మీమాంస తరువాత మొత్తం మీద అది జరిగింది. సాహితీ సమావేశాల కంటే ముందు ఆ గదిలో పాటల రచయిత చంద్రబోస్ గారి కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి వచ్చినవారు కొంతమంది ఇంకా అక్కడే వున్నారు. అందులో మా మిత్రుడి కుటుంబం, మా కుంటుంబం కూడా  వున్నారు. తరువాత సాహితీ సమావేశం అని విని మావాళ్ళూ, మా మిత్రుని కుటుంబం అక్కడి నుండి పారిపోయారు. ఇక మా మిత్రుడు, మా మామగారు, నేను ఇంకా వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినంత మందిమి వున్నాం.

మొత్తం మీద వేదిక మీద వున్నవారి కంటే కింద వున్నవారే తక్కువ మంది వున్నారు. సమావేశాలు మొదలయ్యక మా మిత్రుడు జారుకున్నాడు. మా మామగారికి ఇలాంటివి కాస్త ఆసక్తే. వారు అయినా చివరంటా వుంటారేమో అనుకున్నా. వారూ కాస్సేపు విని తల విదిలించి వెళ్ళిపోయారు. మిగతావారూ వెళ్ళిపోయారు. మిగిలింది నేను ఒక్కడినే. ఫోటోలు తీసేపని నాదే, అందుకే :)) ఎందుకయినా సరే, చివరంటా వున్నా కాబట్టి కొత్తపాళీ గారు వేదిక నుండి దిగివచ్చి అందుకు గానూ నాకు అభినందనలు తెలియజేసారు!

(మా మిత్రుడి) ఇంటికి వెళ్లాక మా మామగారు తన అమూల్యాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు - సాహితీ సమావేశాలు అంత బోరింగ్ గా వున్నాయ్యేంటీ అని. విని నేను తల పంకించాను. కొత్తపాళీ గారి ఉపన్యాసం దాకా మీరు వుండాల్సింది - బావుంటుంది అన్నా. వారు చివరికి ఉపన్యసించారు లెండి. మా మామగారికి ముందు ఇద్దరి ఉపన్యాసాలు వినేసరికే అయిపోయింది - ఓపిక.

అసలే సాహితీ సమావేశాలు - వాటినీ మరీ చప్ప చప్పగా చేయడంలో మనాళ్ళు ఉద్దండులు. 'ఆ చెప్పేవేవో ఆసక్తి కరమయినవి చెప్పొచ్చు కదా, ఆసక్తికరంగా చెప్పొచ్చు కదా' అన్నారు మా మామ గారు. నిజవే.

Advertisement:

ARVY IT SolutionTraining  delivery options from public to in-company and distance learning. Courses: Hadoop, Anaplan, SAP Bods, SAP Bods, SAP HANA, SAP BI/Lumaira.

2 comments: