మనకు బ్లాగుల్లో ఇంకా ఏం కావాలి?


ఈ ప్రశ్న వీవెన్ తన బ్లాగులో వేసారు: 
http://veeven.wordpress.com/2010/02/24/poll-telugu-consumption/

- నాకు ఇతరులు తమ జీవితాల్లో నేర్చుకున్న పాఠాలు, గుణ పాఠాలు కావాలి. ఎందుకంటే అనుభవం లేక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఇతరులు ఆ పొరపాట్లు చేయకుండా అందరికీ ఆ అనుభవాలు చెప్పాలనిపిస్తుంది. అలాగే ఇతరుల అనుభవాలనుండి నేర్చుకోవాలనిపిస్తుంది.

- బ్లాగు ప్రపంచం ఉటోపియా వంటి భ్రమ గొలుపుతున్నది. అది వాస్తవానికి దూరంగా వుంటుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి, తమ కుటుంబం గురించి మంచి విషయాలే వ్రాస్తున్నారు. మా నాన్న గొప్పవారనీ, నా మొగుడు చక్కనివాడనీ అలా అలా వ్రాస్తుంటారు. మీ నాన్న మీ మక్కెలు ఎలా విరగదీసారో, మీ ఆయన ఎలా కాల్చుకుతిన్నారో అవి కూడా వ్రాయండి. అందులో ఇతరులు నేర్చుకోవాల్సిందేమయినా వుంటే తెలపండి.  బహిరంగంగా వ్రాయలేకపోతే అజ్ఞాతంగా వ్రాయండి.

- అందరూ కవితలు తెగ వ్రాసేస్తున్నారు కానీ కథకులు తక్కువగా వున్నారు. వ్రాసిన ఒకరిద్దరూ కూడా సాంఘికమయిన విషయాల మీదనే వ్రాస్తున్నారు. మిస్టరీ, ఫాంటసీ, అపరాధ పరిశోధన లాంటివి ఎవరయినా వ్రాస్తే చూడాలని, చదవాలని వుంది.  

- ప్రపంచం ఎంత అడ్వాన్స్ అవుతున్నా పెద్ద సంకలినులు కొన్ని, కొన్ని విషయాలలో ఇంకా చాదస్తంగానే వుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు LGBT లాంటి విషయాలు. అలాంటివి అభివృద్ది చెందిన దేశాల్లో క్యాజువలుగా చర్చించే విషయాలవి (ఆయా కుటుంబాలలో చాదస్తం లేకపోతే).   అటువంటి విషయాలు బ్లాగుల్లో సాధారణంగా చర్చించే పరిస్థితి రావాలి. తెలుగు బ్లాగు ప్రపంచం బాగా మడికట్టుకొని వుంది. మడిలోంచి బయటకి రావాలి. నీతులు వల్లించడం కాకుండా తమతమ అనుభూతులు చక్కగా, స్వేఛ్ఛగా పంచుకోగలగాలి.    

ప్రస్తుతానికయితే ఇవే ముఖ్యంగా స్పురణకు వస్తున్నాయి. ఇంకా ఏమయినా ఆలోచనలు వస్తే తెలియజేస్తాను. అలాగే మీరు బ్లాగుల్లో ఏం కోరుకుంటున్నారో తెలియజేద్దురూ.

కర్దాషియాన్ & మార్షల్

రియాలిటే స్టార్ కిం కర్దాషియాన్. ఈమె బావుంటుంది. ఈమె, ఈమె పేరు నాకు బాగా నాచ్చుతాయి. ఈమెలోని ఒక విషయం ప్రసిద్ధి లెండి - అది ఇక్కడ చెప్పడం బావోదేమో ;) కిం అభిమానులెవరయినా వుంటే వారికి బాగానే తెలిసేవుంటుంది.   ఈమె షోలు అయితే ఇంతవరకూ చూడలేదు. 

ఈమె లాసేంజెల్సుకి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఎయిర్ మార్షలుట.   ఎయిర్ మార్షల్స్ కొన్ని విమానాలలో ప్రయాణీకులతో పాటు ప్రయాణిస్తూ ఎవరయినా తీవ్రవాద చర్యలు చేపడితే కాపాడాలి. ఫ్లయిట్ ప్రయాణమే బోరు అంటే రోజూ పనిలేకుండా ఫ్లయిట్ ప్రయాణం చేసే ఈ ఉద్యోగం మహా బోరింగ్ అనుకుంటాను. వీళ్ళు రహస్యంగా వుండాలి. తాను ఎయిర్ మార్షల్ అని బయటపడకూడదు. కిం కి అనుమానమొచ్చి పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగితే అవునని చెప్పారట ఆ వ్యక్తి. 

ఇంకేముంది ఎంచక్కా ట్విట్టర్ లో ఆ విషయం విమానంలోంచే వెంటనే ట్వీట్ చేసేసింది. 
"I'm on the airplane...love wifi! I am sitting next to an Air Marshall [sic]! Jim the air marshall [sic] makes me feel safe!"
ఆమెకు ట్విట్టరులో 30 లక్షలమంది అభిమానులున్నారంట.  ఆ ఎయిర్ మార్షలు గారు ఈమెకు చెప్పడం బావుందీ, ఈవిడ గారు ఆ రహస్యాన్ని ట్వీట్ చేయడమూ బావుంది. ఇక్కడ బాగాలేనిదొక్కటే - భద్రత!   

ఈ సైటు ఈమధ్య సంచలనం సృష్టిస్టొందిట




ఇందులో ర్యాండం గా మనకు తారసిల్లే వ్యక్తులతో వెబ్ చాట్ చేయవచ్చు. వన్ బై వన్ మనకు వెబ్ క్యాములలో తారసపడుతుంటారట. మనకు ఇష్టం లేని వ్యక్తులని స్కిప్ చేస్తూ ఇష్టమయిన వ్యక్తులతో చాట్ చేయవచ్చుననీ CNN వార్తా కథనం తెలియజేస్తోంది. నేనింకా పరీక్షించలేదు. మిగతా చాట్ సర్వీసులకూ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని చాట్ సర్వీసులకూ దీనికీ తేడా ఎంటంటే దీంట్ళో మీరు ఎవరితో, ఎలాంటివారితో చాట్ చేయబోతున్నారో బొత్తిగా ఊహించలేకపోవడం. అది మనుషుల్లో ఉత్సుకతనూ, ఆసక్తినీ కలగజేస్తూ ప్రస్తుతానికయితే సంచలనం సృష్టిస్తోందిట. 

CNN వార్తా కథనం:
http://www.cnn.com/2010/TECH/02/22/chatroulette.random.chat/index.html?hpt=C2

అక్బరుద్దీన్, ముట్టడి, జర్నలిస్టులు

అక్బరుద్దీన్ - అందుకో అభినందనలు 
సమైక్య భావనను సమర్ధిస్తూ మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అభిప్రాయాలు వెలిబుచ్చడం సంతోషకరమయిన విషయం. ఇన్నాళ్ళుగా మజ్లిస్ ఏ రకమయిన నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూవస్తున్నాను. వారి పార్టీ ఎలాంటిదయినా కావచ్చు, తస్లిమా నస్రీన్ మీద దాడికి కారణం కూడా వీరే కావచ్చు (ఆ దాడికి సంబంధించిన వివరాలు గుర్తుకులేవు) కానీ తెలంగాణా విషయంలో మాత్రం మజ్లిస్ విధానాన్ని కొనియాడకతప్పదు. ఆ విధానం వెనుక రాజకీయ, మత ప్రయోజనాలు వున్నాయా లేవా అన్నది మనకు అనవసరం. ఇప్పుడు కావాల్సింది సమైక్యవాదానికి హైద్రాబాదులో గట్టి చేయూత. అది ఇప్పుడు లభించింది - సంతోషం. తెలబాన్ల గొంతులో పచ్చి వెలగకాయలా అయిపోయింది ఈ విషయం. మరి ఇక వాళ్ళు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరమే.           

విద్యార్ధుల ముట్టడికి పోలీసులు ఆటంకం కలిగించకూడదు
మరి ఏం చేయాలి? విద్యార్ధులను పోలీసులు ఏం చేసినా కోర్టులు తప్పు పడతాయి కాబట్టి అసెంబ్లీలో విద్యార్ధులు ఏం చేసినా తమాషా చూస్తూ కూర్చోవాలి! అప్పుడు నాగంకి ఉస్మానియాలో పట్టిన గతే అసంబ్లీలోని నాయకులకు అందరికీ పడుతుందేమో. అవన్నీ టివి ఛానల్సులో చూపిస్తాడుగా - పండగ చేసుకుందాం. అన్నట్లు హైకోర్టులో టివి ప్రసారాలు వస్తుంటాయా? ఎందుకంటే న్యాయం ఎన్ని కాళ్ళతో అప్పుడు అసెంబ్లీలో నడుస్తుందో మన న్యాయమూర్తులు చూడొద్దూ మరి!

జర్నలిస్టులకు లాఠీ దెబ్బలా? - తగలాల్సిందే మరి!
భరద్వాజ్ నేనూ మలక్‌పేటలో బాగా కొట్లాడుకుంటున్నాం అనుకోండి. కొట్లాట కాదులెండి - తను ఎలాగూ రౌడీ కదా నన్నే తంతున్నారని కాసేపు అనుకుందాం.  అప్పుడు మీరు ఆ తమాషా చూడాలంటే ఏం చేయాలి? కాస్త దూరంగా వుండి చూడాలి. అలాక్కాకుండా మా మధ్యలో దూరి తమాషా చూస్తామంటే  తనకి కోపం రాదూ? నన్ను వదిలేసి మిమల్ని రెండు పీకడూ? అన్యాయంగా భరద్వాజ్ మిమ్మల్ని పీకాడని మీరు హైకోర్టు కెళ్ళారనుకోండి. న్యాయం ఎవరి వైపు వుంటుందేంటి? AP హైకోర్టు కదా, న్యాయం మీవైపే వుంటుంది!  (ఎదవగేల. ఈ పేరాలో ద్వందార్ధం ఏమీ లేదు!) 

OCD

మేము సూర్యాపేటలో వుంటున్నప్పుడు మా ఇంట్లో మాకు తెలిసిన ఆంటీ ఒకరు కిరాయికి వుండేవారు. ఆమె రెస్టు రూముకి వెళ్ళివచ్చినప్పుడల్లా తన చేతులు అరిగిపోయేటట్లుగా దాదాపు అరగంట అయినా రకరకాలుగా శుభ్రం చేసుకోవడం గమనించేవాడిని.  మా ఇంటి మధ్యలో ఒక బావి వుండేది. ఆ బావి దగ్గర బండ మీద వేసి చేతులు రుద్దుతూ బోలెడన్ని నీళ్ళు వృధా చేసేది. ఈమేంటబ్బా ఇలా అతిగా చేస్తుందేమిటీ అని ఆశ్చర్యపడిపోయేవాడిని కానీ తరువాత్తరువాత అర్ధం అయ్యింది - అలాంటి లక్షణాలు అన్నీ ఆబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్/ డిజార్డర్ అయివుండవచ్చనీ. 

ఇలా చేసిన పనినే చాలా సార్లు వృధాగా చేస్తూపోవడాన్ని  OCD అంటారు. దీనికి చికిత్స వుంది. ఎవరిలోనన్నా ఇది కనిపిస్తే చికిత్స చేయించండి. అంతగా ఆబ్సెషన్ లేకపోయినా  మనందరిలో కూడా అనవసరంగా కొన్ని కొన్ని పనులు అప్రయత్నంగా చేసేస్తుంటాము. ఉదాహరణకు కొంతమంది ఆడవారు తరచుగా పైట సవరించుకుంటారు. నిజంగా అంత అవసరం అన్ని సార్లూ వుండదు కానీ అభద్రతా భావనతో అలా అప్రయత్నంగా సవరించుకుంటారు. అలా ఎక్కువగా పైట సవరించుకునే వారికే ఇతరులను ఆకర్షించాలని ఎక్కువగా వుంటుందని ఒక అభిప్రాయం వుంది కానీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు.  

అలాగే మగవాళ్ళు జిప్ సవరించుకుంటారేమో. మేతావులకూ, మేధావులకూ కొంత మతిమరుపు సహజం కాబట్టి కొండొకచో జిప్పు పెట్టుకోకుండా ఆఫీసుకి వెళ్ళిన సందర్భాలు నాకు వున్నాయి. ఎవరూ గమనించక ముందే సర్దుకున్నానులెండి. అయినా ఆ భయంతో తరచుగా జిప్పు సరిగ్గా వుందో లేదో అని తరచుగా తడిమి చూసుకుంటూవుంటాను. ఇలాంటి అవస్థే ఇంకా కొంతమందికి వుండవచ్చు.  

ఆ మధ్య మా బంధువు ఒకరు తన తోడల్లుడు గురించి ఒక విషయం చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అన్నీ ఆర్డర్ లో వుండాలిట. ఏ వస్తువు ఎక్కడ వుండాలో అక్కడే వుండాలిట. ఏమాత్రం క్రమం తప్పినా తనలో విపరీతమయిన అసహనం వచ్చేసి గొడవ అయిపోద్దిట. అందుకే వారి ఇంటికి వెళ్ళడానికి ఇతరులు తటపటాయిస్తుంటారుట. ఇది  కూడా OCD క్రిందికే వచ్చెస్తుందేమో. వారియొక్క మరో తోడల్లుడు ఇక్కడ యు ఎస్ లోనే మంచి డాక్టరు. మరి తన తోడల్లుడి గురించి ఈ విషయంపై ఎందుకు కేర్ తీసుకోలేదో తెలుసుకోవాల్సివుంది.

న్యాయమూర్తులూ - మీరే కావాలి పోలీసు అధికారులు!

పోలీసుల పని పోలీసులని చేయనివ్వకుండా శాంతి భద్రతలని భుజాన ఎత్తుకొని మహా బాగా కర్తవ్య నిర్వహణ చేసేందుకై జర్నలిస్టులు పోలీసులో చంకల్లో వుంటారు. మనది ఎంబెడ్డెడ్ జర్నలిజం అయ్యింది. దాని గురించి మరోసారి చర్చిద్దాం. ఇక హైకోర్టు న్యాయమూర్తులు - ముఖ్యంగా తెలంగాణా జడ్జిలు పోలీసుల తలమీద కూర్చొని శాంతి భద్రతలు కాపాడుతునారు. భేష్! అభినందనలు.

విద్యార్దుల మీద, జర్నలిస్టుల మీద లాఠీ చార్జి చేసినందుకు హైకోర్టు పోలీసులను తీవ్రంగా తిట్టేసింది ఈ వార్తలన్నీ చూసాక చాలా సంతోషం అనిపించింది. లా & ఆర్డర్ ఎలాగూ పోలీసుల వల్ల కావడం లేదు. దానిని రక్షించడానికి, నిలబెట్టడానికి మనకు న్యాయమూర్తులున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో రక్షణకు దిక్కేదీ అని బెంగపడ్డ నాలో చక్కని ఆశ చిగురించింది. మన న్యాయాధీశులు వుండగా ఇక మనకు బెంగ ఏల.             

ఎవరి పరిధుల్లో వారు ఉండక అస్థమానూ పోలీసుల వ్యవహార శైలిపై జాగరూకతతో వుంటూ పోలీసులని నిభాయిస్తూ, నగర శాంతిభద్రతలే ధ్యేయంగా పని చేస్తూ వస్తున్న న్యాయాధీశుల కర్తవ్య దీక్షని మన అందరం మెచ్చుకోవాలి. డి జి పి ని వెంటనే పీకి వేసి హైకోర్టు ప్రధాన న్యాయాధికారిని డి జి పి గా చేస్తే మనం వారి సేవలను గుర్తించినట్లవుతుంది. ఇంకా మిగతా అసిస్టెంటు, అడిషనల్ డి జి పి లను గట్రా పీకి వేసి ఆ పదవులను హైకోర్టు జడ్జిలకు వెంటనే ఇవ్వాలి. ఆ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిందిగా హోం మంత్రి సబితమ్మను నేను డిమాండు చేస్తున్నాను. 

ప్రేమిస్తే పెళ్ళాడాలా?

చివరికి ఈ క్రింది బ్లాగుని నా కొత్త బ్లాగుగా డిసైడ్ చేసి జత చేయాల్సిందిగా అన్ని సంకలినిలకు పంపించాను. ఈ టపాను ఆ బ్లాగులో చూడండి.

http://swapnaraagaleena.blogspot.com/2010/02/blog-post_13.html

బ్లాగ్మిత్రులు

కొత్త బ్లాగు మొదలెడుతున్నానని తెలిపాను కదా.  ఇక సంకలినిలలోకి జతచేయమని కోరుతాను.
అందాక అక్కడ ఈ టపా చదవండి. కొందరు మిత్రులు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేరే బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసారు. వాటినన్నింటినీ త్వరలో కొత్త బ్లాగులో ప్రచురిస్తాను.   

http://swapnaraagaleena.blogspot.com/

వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ ద్రౌపదీ!!!!!



ద్రౌపది చదివేసాము. నవల గురించి వివరంగా మా అభిప్రాయాలు మరో సారి. నవల మొత్తానికీ నాకు బాగా నచ్చిన పేరా ఒకటుంది. అది 7'5' వ పేజీలో వస్తుంది. నవలలో అదే మొదటి శృంగార ఘట్టం అని ఒక సమీక్షలో చదివాను.





ద్రౌపది కంటే కూడానూ ద్రౌపది గత జన్మ అయిన ఇంద్రసేన జన్మ నాకు బాగా నచ్చింది. ఆ జన్మలో చాలా కాలం సినిమా కష్టాలు పడినప్పటికీ ఆ కష్టాలకు గానూ చివరికి పొందిన ఫలితం (నా దృష్టిలో) ఉత్కృష్టమయినది. ఆ ఆనందం ఎక్కువసేపు లేకపోవచ్చు కానీ ద్రౌపది తన జీవితకాలంలో పొందలేని శృంగారానందం ఆ కాసేపట్లో పొందింది.



ఆ పేరా ఇక్కడ ఇవ్వొచ్చు కానీ శృంగారాన్ని కూడా బూతు అనుకునే పెద్దమనుషులు, ప్రబుద్ధులూ ఖండిస్తారు కాబట్టి అందులో సింబాలిక్ గా పువ్వుల మీద వున్న చివరి వాక్యాన్ని మాత్రం ఈ నవల చదవని, చదవలేని వారికోసం అందిస్తాను:





అయిదు తుమ్మెదలు ఒకే పూవులోని మకరందాన్ని ఏకకాలంలో గ్రోలుతున్నాయి.

పాపం ధర్మరాజు :))

ఏ నవలలోనయినా నవరసాలు వుండొచ్చు కానీ మనకు కావాల్సిన రసాలకి మనం ఎక్కువ అనుభూతి చెందుతాం. అలాగే నాకు నచ్చిన రసాలని నేను ఎక్కువగా అనుభూతి చెందుతాను. గొప్పదో కాదో గానీ బాగా వివాదాస్పదం అయ్యింది కాబట్టి ఈ మధ్య ద్రౌపదిని తీరిక దొరికినప్పుడల్లా చదివేస్తున్నాను. అర్ధభాగం వరకు పూర్తిచేసాను.   

అందులో ద్రౌపది - ధ్రర్మరాజుల గురించి ఒక భాగం ధర్మరాజు ఆత్మన్యూనత వుంది. నిన్న అది చదివాక ధర్మరాజు గురించి బాగా నవ్వొచ్చింది. పాపం - యార్లగడ్డ గడ్డ వారు రాజుగారి పరువు పుస్తకంలో పెట్టేసారు. మనం గొప్ప వ్యక్తులు అనుకున్నవారికి కూడా మానవసహజ బలహీనతలు లేదా బలహీనక్షణాలు వుంటాయి అని నొక్కి చెప్పడం రచయిత భావం కావచ్చు. ఆ భావం సమర్ధనీయం కూడా కావచ్చు. నాకు మాత్రం రాజుగారి అవస్థ చూసి భలే నవ్వొచ్చింది. 

ధర్మరాజు గారు బ్రతికివుంటే మాత్రం యార్లగడ్డ గారి మీద పరువు నష్టం దావా తప్పకుండా వేసేవారు :)  ద్రౌపదికి మొట్టమొదటి సారి తాను శీఘ్రదర్శనం మాత్రమే ఇచ్చాడని అందరికీ తెలిస్తే పరువు పోదూ మరి! రాజు గారు అసలే జూదరి అని ఆల్రెడీ అందరికీ కాస్త లోకువ. దానికి తోడుగా ఇప్పుడు ఇదొకటి.  ఇదండీ రాజుగారి లఘుదర్శనం కథా కమీశూ. వివరాలు అడక్కండి - చెప్పడానికి ఇక్కడ బావోదు - పుస్తకం చదివేయండి. అవార్డ్ వచ్చిన పుస్తకంలోని విషయాలు కూడా స్వేఛ్ఛగా వ్రాయలేని పరిస్థితి నాది.